Thrill city : హైద్రాబాద్‌లోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ థ్రిల్ సిటీ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్‌లకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ పార్క్‌లోని వివిధ ఆకర్షణలను కేంద్రంగా చేసుకుని సృజనాత్మక వీడియో రీల్స్‌ను తయారు చేసిన వారికి లక్షల రూపాయల నగదు బహుమతులు లభించే అవకాశం ఉంది.

థ్రిల్లింగ్ ఇన్ఫ్లూయన్సర్ చాలెంజ్ అనే ఈ కార్యక్రమం యువ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా, పార్క్‌లోని ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్ వంటి ఆకర్షణలను ప్రదర్శించే సృజనాత్మక వీడియో రీల్స్‌ను తయారు చేయాలి. ఈ రీల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.

పోటీలో పాల్గొన్న అన్ని వీడియోలను నిపుణుల బృందం పరిశీలిస్తుంది. అత్యంత సృజనాత్మకమైన మరియు ఆకర్షణీయమైన మూడు వీడియోలను ఎంపిక చేస్తారు. ప్రతి విజేతకు రూ.1,00,000/- నగదు బహుమతి అందజేయబడుతుంది.  సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అవకాశాలను అందిస్తుంది. క్రియేటివిటీ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు అని యూత్ స్టార్ విశ్వక్ సేన్ అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నాము . మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తామని బందూక్ లక్ష్మణ్ అన్నారు.

Leave a comment

error: Content is protected !!