Parada movie : ఈ ఏడాది అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటి అనుపమ పరమేశ్వరన్‌ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరదా’ చిత్రం తాజాగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్‌ మక్కువ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఒక భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో తెరకెక్కింది.

దర్శకుడు ప్రవీణ్‌ సోషల్ మీడియాలో అనుపమతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ, ‘సినిమాని ముగించాం. దీనిపై మేము చాలా ప్రేమను కురిపించాం. విడుదల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. అనుపమ చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది’ అని రాసుకొచ్చారు.

Leave a comment

error: Content is protected !!