NTR – Neel combo : టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కలయికగా భావిస్తున్న యంగ్ టైగర్  ఎన్టీఆర్, కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం.. నేడు హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. అనధికారికంగా “డ్రాగన్” అని పిలువబడే ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ భారీ చిత్రం ప్రారంభ కార్యక్రమం అనంతరం.. మేకర్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలియగానే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు.

ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుండటం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘కెజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ చిత్రంతో మరోసారి తనదైన మార్క్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నారు.

Leave a comment

error: Content is protected !!