Akkineni Nagachaitanya : అక్కినేని కుటుంబంలో మరోసారి వివాహ శోభలు వెల్లివిరిసేందుకు రంగం సిద్ధమవుతోంది. నాగచైతన్య తన ప్రియురాలు శోభిత దూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు.  హీరోయిన్ సమంతని వివాహం చేసుకుని, కొంతకాలం తర్వాత విడాకులు తీసుకున్న నాగచైతన్య, ఇప్పుడు శోభిత దూళిపాళతో సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు.

తమిళనాడులో జన్మించిన శోభిత దూళిపాళ, ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ విన్నర్‌. శోభిత దూళిపాళ భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలలో శిక్షణ పొందింది. ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రంతో శోభిత తొలిసారిగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారమైన వెబ్ సిరీస్‌ల ద్వారా శోభితకు మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత బాలీవుడ్, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. ఇంక శోభిత, చైతూల నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది. నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఒక ఫోటో కూడా షేర్ చేయడం విశేషం.

Leave a comment

error: Content is protected !!