Siddhu Jonnalagadda : డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సిద్దు జొన్నలగడ్డ తన లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’ తో మరోసారి అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా, కన్నడ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ ఎప్పటిలాగే కొత్త అవతారంలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, జ్ఞానశేఖర్ బాబా ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. కొత్తదనం నిండిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

Leave a comment

error: Content is protected !!