Pushpa 2 : ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో నాలుగో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో .. రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా… ‘పుష్ప 2’ చిత్ర యూనిట్ ఒక కీలక అప్‌డేట్‌ను అందించింది.

ప్రస్తుతం చిత్ర యూనిట్ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  ‘పుష్ప 2’ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మరోసారి అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

మొదటి భాగంలోని తన పెర్ఫార్మెన్స్ కు నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ సెకండ్ పార్ట్ లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రష్మికా మందన్న హీరోయిన్ గా కంటిన్యూ అవుతుండగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ , ధనుంజయ్ పాత్రలు కూడా రెండో భాగంలోనూ కొనసాగుతున్నాయి.

Leave a comment

error: Content is protected !!