MegaFamily : మెగా హీరోలు అభిమానుల హృదయాలను దోచుకునే విషయంలో మాత్రమే కాదు, సమాజ సేవలోనూ ముందుంటారు. ఇటీవల కేరళలో సంభవించిన ఘోర ప్రకృతి విపత్తు సమయంలో కూడా మెగా కుటుంబం తమ ఉదారతను చాటుకుంది. కేరళలోని వయనాడ్‌లో కొండచెరియలు విరిగిపడిన విషాదకర ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంపై సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కేరళ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయాలని ముందుకొచ్చింది.

ఈ క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమ వంతు సహాయాన్ని అందించారు. లేటెస్ట్ గాా మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ విరాళాలతో మెగా హీరోలు మరోసారి సమాజం పట్ల తమ బాధ్యతను చాటి చెప్పారు. కేవలం బిగ్ స్క్రీన్‌పై మాత్రమే కాకుండా, ఇలాంటి విపత్తు సమయాల్లో సమాజానికి తమ వంతు సహాయం చేయడం ద్వారా మెగా హీరోలు తమ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!