Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తో్న్న సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ చిత్రం క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించింది. ప్రముఖ యాక్షన్ కోరియోగ్రాఫర్ అనల్ అరసు ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారు. చిత్ర బృందం ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటుందని, సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది.

Leave a comment

error: Content is protected !!