Gudhachari 2 : తెలుగు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు అడివి శేష్. తన కొత్త చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలో ‘డెకాయిట్’ , ‘గూఢచారి 2’ వంటి భిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా, ‘గూఢచారి’ చిత్రం విడుదలై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అడివి శేష్ తన అభిమానులకు ఒక ఆహ్లాదకరమైన వార్తను ప్రకటించాడు. రేపు మధ్యాహ్నం 3:06 గంటలకు, ‘గూఢచారి 2’ నుండి ఆరు ఆసక్తికరమైన మూమెంట్స్ ను షేర్ చేయనున్నట్లు తెలిపాడు.

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు AK ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ‘గూఢచారి 2’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!