Double Ismart : ఎనర్జిక్ స్టార్ రామ్‌ పోతినేని హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయికగా నటించింది.

ఈ చిత్రం కోసం రామ్‌ తన డబ్బింగ్‌ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన వీడియోలో రామ్‌ చెప్పిన “మామ..మాస్క్‌ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనపడతడు..” అనే డైలాగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ట్రైలర్‌ ఆగస్టు 4న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. పూరి కనెక్ట్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మాణం జరపుకుంటోంది.

Leave a comment

error: Content is protected !!