Janvikapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా ‘దేవర’ తో ఎన్టీఆర్‌ కు జోడీగా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇది ఇంకా పూర్తి కాకముందే జాన్వీకి టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించనున్న రామ్ చరణ్ RC16 లో ఆమె కథానాయికగా నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

ఇప్పుడు, జాన్వీ కపూర్ తన మూడవ తెలుగు ప్రాజెక్ట్‌కు సంతకం చేసిందని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో బజ్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రాకారం నానీ , శ్రీకాంత్ ఓదెల ఇంకా టైటిల్ పెట్టని ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైందని టాక్. శ్రీకాంత్ ఓదెల విలేజ్ యాక్షన్ డ్రామా దసరాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇది నానీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది.. జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే, హైప్ మరింత పెరుగుతుంది. అది జరుగుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఉలాజ్ విడుదలకు సిద్ధమవుతోంది. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ నటించిన స్పై థ్రిల్లర్ ఆగస్టు 2న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!