Thripthi Dimri :  వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ. ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న “తేరే ఇష్క్ మే” అనే హిందీ చిత్రంలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. “రాంఝనా” సినిమా తరహాలో ఓ విషాద ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ధనుష్ ప్రియురాలి పాత్రలో త్రిప్తి కనిపించనుంది. ఈ చిత్రాన్ని ప్రకటించి దాదాపు ఒక సంవత్సరం అవుతున్నా, ధనుష్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నిర్మాణం ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత అధికారిక సమాచారం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!