Kanguva movie : సూర్య లేటెస్ట్ మూవీ ‘కంగువ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అక్టోబర్ 10 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. కమర్షియల్ యాక్షన్ మూవీస్ తీయడంలో దిట్టైన శివ ఈ భారీ చిత్రానికి దర్శకుడు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగువ రెండు భాగాల సినిమా అని స్టూడియో గ్రీన్ వ్యవస్థాపకుడు జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ ‘పార్ట్ 1, పార్ట్ 2కి కథ రాసుకున్నాం. మొదటి భాగాన్ని పూర్తి చేశాం. మేము ఇంకా సీక్వెల్ నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. కంగువ 1 చిత్రీకరణను పూర్తి చేయడానికి మేము 185 రోజులు తీసుకున్నాము. రెండవ భాగం 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ప్రారంభమవుతుంది. కంగువ 2ని 2027 జనవరి లేదా వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము’. అని అన్నారు.

“పార్ట్ 1 ని నీట్ గా తీస్తే పార్ట్ 2 ఎలాగైనా ఆదుకుంటుంది. మొదటి భాగం చివర్లో ప్రేక్షకులను సీక్వెల్‌కి కట్టిపడేసేలా ఎగ్జైటింగ్‌గా ఉంది. సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి మేకర్స్ భారీ ప్లాన్స్ వేసినట్లు తెలుస్తోంది మరి మొదటి భాగాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటిస్తుండగా, మరో హిందీ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

Leave a comment

error: Content is protected !!