Gamechanger : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లోని పాన్-ఇండియా పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్. ఈ సినిమా పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను తమ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకమైన 50వ సినిమాగా నిర్మిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో మరపురాని ప్రాజెక్ట్‌గా మార్చడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ గా ఒక అద్భుతమైన అప్‌డేట్ వచ్చింది. తాజాగా రామ్ చరణ్ ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ని ముగించాడు. శంకర్ మొత్తం నిర్మాణ ఫార్మాలిటీలను ముగించడానికి, చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు అందించడానికి సమయం ఆసన్నమైంది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాడు.

గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఎస్‌జే సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియన్ 2 రిలీజయ్యాకా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ను లాక్ చేయాలని శంకర్ చూస్తున్నారు

Leave a comment

error: Content is protected !!