Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఆరు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. వరుస షూటింగ్‌లతో ఆమెకు విశ్రాంతి సమయం చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఇటీవల ఆమెకు కొంత విరామం దొరికింది. దాంతో ఆమె ఇటలీకి వెళ్ళి సేద తీరుతోంది.

ఇటలీలో అందమైన ప్రదేశాలను చూస్తూ, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ, పుస్తకాలు చదువుతూ రష్మిక సమయాన్ని ఆనందంగా గడుపుతోంది. తన విహార యాత్ర ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది రష్మికా. ఈ ఫోటోలన్నీ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉన్నాయి. నిత్యం కెమెరా లైట్ల మధ్య బిజీగా ఉండే రష్మికకు ఈ యాత్ర చాలా రిలాక్సింగ్‌గా ఉందని చెప్పింది.

గత ఏడాది “యానిమల్” చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆరు చిత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రాలలో “పుష్ప-2”, “కుబేర”, “సికందర్” (హిందీ) వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా తనకు విజయవంతమైనదేనని రష్మిక ఆశిస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!