Rakul Preeth singh : టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కు జోడీగా “దే దే ప్యార్ దే 2” మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ ‘దేదే ప్యార్ దే’ చిత్రానికిది సీక్వెల్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ , ఈ సినిమా లోని  తన అనుభవాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

“ప్రేక్షకులకు డబుల్ డోస్ ధమాకా అందించడానికి మేము తిరిగొచ్చాము,” అని రకుల్ చెప్పారు. “మళ్లీ ఆయేషా పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది. సహనటుడు అజయ్, చిత్రబృందంతో కలిసి మరోసారి పనిచేయడానికి అవకాశం రావడం గొప్ప విషయం. సెట్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నాకు సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగింది.” బాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పుడు, దక్షిణాదిలో పనిచేసినప్పుడు లభించినంత ప్రేమ ఈ సినిమాతోనే తనకు లభించిందని రకుల్ చెప్పారు. “తొలి భాగం కంటే ఈ సీక్వెల్ చాలా భిన్నంగా ఉంటుంది,” అని ఆమె వెల్లడించారు. మరోవైపు, రకుల్ త్వరలోనే “భారతీయుడు 2” చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం కూడా జూన్ లో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!