Nimmakuru mastaru : ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం “నిమ్మకూరు మాస్టారు”. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో నటించే ఈ చిత్రానికి జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి నిర్మాత కగా.. “అముదేశ్వర్” దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కవి జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

 

Leave a comment

error: Content is protected !!