Ganesh Acharya :  “పుష్ప 2” లోని “సూసేకి” పాట విడుదలై కొన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చాలామంది ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకువెళ్తోంది ఈ పాట. అల్లు అర్జున్‌ – రష్మిక మధ్య కెమిస్ట్రీ, హుక్‌ స్టెప్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన గణేశ్‌ ఆచార్య ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు. “సూసేకి.. స్వీట్‌ సాంగ్‌. గ్రాండ్‌గా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలో మేకింగ్‌ మాత్రమే చూపించాం. అసలైన డ్యాన్స్‌ చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎనిమిది రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు. అద్భుతమైన హుక్‌ స్టెప్‌ ఉండాలని డిసైడయ్యాను. దానికి తగ్గట్టే కొరియోగ్రఫీ చేశా. అల్లు అర్జున్‌- రష్మిక తమ డ్యాన్స్‌తో అలరిస్తారు” అని ఆయన వెల్లడించారు.

‘పుష్ప 1’లోని ‘ఊ అంటావా మావ..’ పాటకు కూడా గణేశ్‌ ఆచార్యే కొరియోగ్రఫీ చేశారు. ‘పుష్ప 1’ ఘన విజయం సాధించడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో ‘పుష్ప 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘ఊ అంటావా మావ’ను మించేలా ‘పుష్ప 2’లో స్పెషల్‌ సాంగ్‌ ఉండేలా టీమ్‌ సన్నాహాలు చేస్తోంది. అందులో బాలీవుడ్‌ నటి ఆడిపాడే అవకాశాలున్నాయని సమాచారం. సుకుమార్‌ డైరెక్ట్ చేసిన ఈ పాన్‌ ఇండియా మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!