Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక సెట్ ను సిద్ధం చేసింది. ఈ సెట్‌లో ధనుష్, నాగార్జునతో పాటు మిగిలిన తారాగణంపై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. విభిన్నమైన సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్, నాగార్జునలు మునుపెన్నడూ చేయని కొత్త పాత్రల్లో నటించబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ధనుష్ ప్రస్తుతం మరో చిత్రంలో సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితకథలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

Leave a comment

error: Content is protected !!