Rashimika Mandanna :  టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ “బేబీ” చిత్రంతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన “గం గం గణేశా” చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజైన ట్రైలర్లు, టీజర్లకు మంచి స్పందన లభించింది.

చిత్రం విడుదలకు దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. తాజాగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. “నాకు చాలా ఇష్టమైన కో-స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అని రష్మిక అన్నారు. “గం గం గణేశా” సినిమా విజయవంతమైతే ఆనంద్ దేవరకొండ ముఖంలో చిరునవ్వు చిగురిస్తుందని, ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నానని, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తున్నారు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Leave a comment

error: Content is protected !!