Rajanikanth – Satyaraj : 38 సంవత్సరాల తర్వాత ఒకే చిత్రంలో కనిపించనున్న ఈ ఇద్దరు దిగ్గజ నటుల కలయిక సినీ అభిమానులను ఉత్కంఠభరితంగా మార్చింది. వాళ్ళు మరెరవరో కాదు తలైవా రజనీకాంత్, కట్టప్ప సత్యరాజ్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలి చిత్రంలో రజనీకాంత్ తో సత్యరాజ్ స్ర్కీన్ షేర్ చేసుకోబోతుండడం విశేషం. చివరిసారిగా ఈ ఇద్దరూ మిస్టర్ భరత్ లో తండ్రీ, కొడుకులుగా నటించారు. ఇంక  ఈ సినిమాలో ఆయన సరసన శోభన నటించనున్నారు. కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

1986లో కావేరీ జల వివాదం కారణంగా రజనీకాంత్, సత్యరాజ్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరు నటులు కలిసి నటించలేదు. లోకేశ్ కనగరాజ్ చొరవతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ ఒకే చిత్రంలో కలిసి నటించడానికి అంగీకరించారు. ‘కూలీ’ చిత్రంలో సత్యరాజ్ రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

రజనీకాంత్, సత్యరాజ్ కలిసి నటిస్తున్నారనే వార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!