Pushpa 2 :  ప్రమోషన్స్ తో పాటు చిత్రీకరణతోనూ బిజీగా ఉంది పుష్ప 2 టీం. షూటింగ్ పార్ట్ దాదాపుగా ముగిసింది. ప్రస్తుతం చిత్రబృందం క్లైమాక్స్ చిత్రీకరణ పై దృష్టి పెట్టింది. ఈ సీన్స్ చిత్రీకరణ రెండు వారాలకు పైగా జరుగుతుందని సమాచారం. పోరాట ఘట్టాలతో పాటు కొన్ని టాకీ సన్నివేశాలు కూడా ఈ భాగంలో ఉంటాయని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లైమాక్స్ చిత్రీకరణ తర్వాత ప్రత్యేక గీతం చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. తొలి భాగంలోని ‘ఊ అంటావా…’ పాట ఎంతో ఆదరణ పొందింది. దీనికి దీటుగా ‘పుష్ప 2’లో కూడా ప్రత్యేక గీతం ఉండేలా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పాటలో బాలీవుడ్‌ తారల్లో ఎవరు నర్తి్స్తారనేది ఆసక్తికరంగా మారింది.

Leave a comment

error: Content is protected !!