Manam movie :  తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నుండి ప్రారంభమైన ఈ వారసత్వం నాగార్జున, నాగచైతన్య, అఖిల్ వరకు కొనసాగుతోంది. ఈ మూడు తరాల నటులు కలిసి నటించిన ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం ‘మనం’. 2014లో విడుదలై 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న  ఈ చిత్రం  అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది .

ఇది మూడు తరాల నటులను కలిసి చూపించే ఏకైక చిత్రం. నటసామ్రాట్ నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. నాగేశ్వరరావుకు ఇది చివరి సినిమా కూడా.  ఇది ఒక అద్భుతమైన కథతో రూపొందిన ఫాంటసీ చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ అద్భుతమైన నిర్మాణ విలువలు, అనూప్ రూబెన్స్ సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింతగా వన్నె తెచ్చిపెట్టాయి.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలై 10 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంగా, అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేసింది. ఈ సందర్భంగా, వారు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లలో వీక్షించి, అభిమానులతో కలిసి ఆనందించారు. ‘మనం’ తెలుగు సినిమా అభిమానులకు ఒక అపురూపమైన చిత్రంగా గుర్తుండిపోతుంది.

Leave a comment

error: Content is protected !!