Vijay Devarakonda : హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. 2020లోనే ఫాల్కన్‌ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను ప్రకటించింది. 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసింది. కానీ, ఇప్పటికీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

ఈ కాంబో సినిమా ఆలస్యంపై ‘గం గం గణేశా’ ట్రైలర్‌ విడుదల వేడుకలో నిర్మాత వంశీ కారుమంచి స్పందించారు. “సుకుమార్, విజయ్ ఇద్దరూ బిజీగా ఉన్నారు. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నారు. అది పూర్తయిన తర్వాత విజయ్ తో సినిమా తెరకెక్కిస్తారు. ఆ ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుంది” అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాతే విజయ్ తో సినిమా ప్రారంభం కావచ్చు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సాంకృత్యాయన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మూడు సినిమాలు చేయనున్నారు.

Leave a comment

error: Content is protected !!