నేటి తరం తెలుగు హీరోయిన్లలో రష్మిక మందన్న తిరుగులేని నటి మణి . వరుస ఆఫర్లతో, భారీ చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న రష్మిక, తన కెరీర్‌ను నిలకడగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇటీవలే ‘యానిమల్’ చిత్రంలో అద్భుత నటనతో మెప్పించింది రష్మిక. కమింగ్ డేస్ లో అమ్మడు మూడు భారీ చిత్రాల తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన ‘సికిందర్’ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది రష్మిక. ఇది రష్మిక కెరీర్‌లో మరో మైలురాయి అని చెప్పవచ్చు.
అంతేకాకుండా, ‘పుష్ప 2’లో మళ్లీ శ్రీవల్లి పాత్రలో అలరించనుంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ‘చావా’ సినిమాలో విక్కీ కౌశల్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక, శంభాజీ మహారాజ్ భార్య ఏసుభాయ్ బోన్సలే పాత్రలో నటిస్తుంది.
తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రీకరణలో ఉంది రష్మిక. ధనుష్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేరా’ లో నటిస్తోంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.
వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ లో కూడా రష్మిక నటించనుంది. ఈ భారీ లైనప్‌తో రష్మిక మందన్న రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాను డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి కథల తో అద్భుతమైన ప్లానింగ్‌తో దూసుకుపోతున్న రష్మిక, ఇతర హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!