ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులకు శుభవార్త. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “డబల్ ఐస్మార్ట్” సినిమా రామ్ పోతినేని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డబుల్ ఐస్మార్ట్ టీజర్ మే 15న విడుదల కాబోతోంది. ఈ టీజర్ సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోంది. ఇటీవలే ముంబైలోని షెడ్యూల్‌లో చిత్ర యూనిట్‌ పాల్గొని, ప్రధాన నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమాలో లెజెండరీ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించడం అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీ కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా.. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

Leave a comment

error: Content is protected !!