జయం రవి, కీర్తి సురేష్‌, అనుపమ పరమేశ్వరన్‌ మెయిన్‌ లీడ్‌ తో ఆంథోని భాగ్యరాజ్‌ డైరెక్షన్‌లో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెలుగులో మహేశ్వర్‌ రెడ్డి నిర్మించిన మూవీ సైరన్‌‘.

ఈ చిత్రానికి పాత్రలు తాలూకూ ఎమోషనే ప్రధానబలం. ఆ ఎమోషన్‌ ఎలివేట్ అయ్యేలా జీవి సంగీతం ప్రాణం పోసారన్నారు హీరో జయం రవి. లేడీ పోలీసాఫీసర్‌ పాత్ర పోషించిన కీర్తి సురేష్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసిందన్నారు. మా సైరన్తమిళ తెలుగు ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం పూర్తిగా ఉందిఅన్నారు.

జయం రవి చాలా ప్రతిభ గల నటుడు. ఇంకో వంద చిత్రాలైన చెయ్యగల నేర్పు అతనిలో ఉందని మెచ్చుకున్నారు దర్శక నటుడు సముద్రఖని.

సైరన్చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. జయం రవి గారు మునుపెన్నడూ కనిపించని లుక్ మరియు పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ మొదటి సారి ఆయనతో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు చిత్ర నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌.

ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరో తో అయినప్పుడు, కచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి గారు తీసుకున్నారన్నారు చిత్ర దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్‌.

ఈ చిత్ర తెలుగు టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!