Shopping Cart 0 items - $0.00 0

రేటు పెంచేసిందట.. మీకు అర్ధమవుతోందా….?

 

‘ఛలో, గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ లాంటి మీడియం బడ్జెట్ చిత్రాలతో క్యూట్ బేబ్ రష్మికా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ క్రెడిట్ తోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నటించే అరుదైన అవకాశం దక్కించుకొని.. అతి కొద్దికాలంలోనే తన స్థాయిని పెంచుకుంది. దానికి తోడు ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో.. తన పారితోషికాన్ని కూడా ఓ రేంజ్ లో  పెంచేసిందని సమాచారం. అమ్మాయిగారు ఇక ముందు నటించబోయే సినిమాలకోసం ఏకంగా.. రూ. 2కోట్లు డిమాండ్ చేస్తోందట.  

నిజానికి రష్మికా మందణ్ణ నిన్నమొన్నటి వరకూ ఒకో మూవీకి రూ. 1కోటి మాత్రమే పారితోషికంగా తీసుకునేది. కానీ  ఇప్పుడు ‘సరిలేరు…..’ ఎఫెక్ట్ తో ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్స్  లిస్ట్ లోకి చేరిపోయింది. అందుకే ఆవిడగారు.. ఎంత అడిగినా అంత ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారట. ప్రస్తుతం నితిన్ తో ‘భీష్మ’ లోనూ, అల్లు అర్జున్ ,సుకుమార్ చిత్రంలోనూ రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోంది.  ఇంకా మరికొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి. సో… అందుకే  రష్మికా రేటు పెంచేసిందట.. మీకు  అర్ధమవుతోందా?

Leave a comment

error: Content is protected !!