సౌత్ ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్ గా వుంటుందని విన్నాను. ఈ సినిమాతో ప్రత్యక్షంగా చూశాను. చాలా గౌరవంగా మర్యాదగా చూసుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు. అలాగే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ వుంటారు అంటోంది టైగర్‌ నాగేశ్వరరావు హీరోయిన్ నుపుర్‌ సనన్‌. రవితేజ లేటెస్ట్‌ మూవీ టైగర్‌ నాగేశ్వరరావు అక్టోబర్‌ 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా.. పాత్రికేయుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్. ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా విజయాలు ఇచ్చారు. ఇది నాకు మంచి లాంచింగ్ ప్రాజెక్ట్ అవుతుందని భావించాను. అలాగే దర్శకుడు వంశీ గారు. ఈ పాత్ర కోసం దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేశారని తెలిసింది. ఈ పాత్రకు నేను యాప్ట్ గా వుంటానని ఆయన బిలీవ్ చేయడం నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.

రవితేజ యాక్టింగ్ అమేజింగ్. ఆయన కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంటుంది. మాస్ మహారాజా టైటిల్ రవితేజ గారికి యాప్ట్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన హిందీ చాలా అద్భుతంగా వుంటుంది. షూటింగ్ లో చాలా సపోర్ట్ చేశారు. ఆయన వలన లాగ్వెంజ్ బారియర్ తొలిగిపోయింది.

వ్యక్తిగత విషయాలకొస్తే.. హీరోయిన్ సాయిపల్లవి, హీరోల్లో నాని, రామ్‌, విశ్వక్‌సేన్‌లంటే ఇష్టం.. భవిష్యత్ లో ఒక బలమైన ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలని వుంది. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధికి తో ఓ సినిమా చేస్తున్నానుఅన్నారు నుపుర్‌ సనన్‌.

Leave a comment

error: Content is protected !!