అప్పట్లో నాగార్జున చేసిన అంతం.. కమల్‌ హాసన్‌ నటించిన అర్జున.. ఇలాంటి గ్రేట్‌ మూవీస్‌ హిందీలో ద్రోహి పేరుతో రిలీజ్‌ అయ్యాయి. ఇప్పుడు అదే ద్రోహి పేరుతో తెలుగులో యంగ్‌స్టర్స్‌ ఓ సినిమా చేస్తున్నారు. విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తూ.. డి శ్రీకాంత్‌ రెడ్డి తో కలిసి నిర్మిస్తున్న మూవీ ద్రోహి. దీనికి ది క్రిమినల్‌ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. సాధారణంగా నమ్మకస్తుడు ఆఫర్స్‌ ఇస్తే నమ్మొచ్చు.. కానీ ఆడియెన్స్‌కి ఈ ద్రోహి ఓ ఆఫర్ ఇస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ కాబోతున్న అక్టోబర్‌ 13 న మల్టీప్లెక్స్‌లో 112 రూపాయలకే టిక్కెట్‌ ఆఫర్ ఇస్తోంది.

సందీప్‌ కుమార్, దీప్తి వర్మ, డెబా డాలీ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ మూవీ టీజర్‌ ను లాంచ్ చేసారు. హీరో త్రిగుణ్ లాంచ్ చేసిన ద్రోహి టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని అతిధులు, ఆహ్వానితులు ఆకాంక్షించారు. నటీ నటులు చిత్ర దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్తూ.. సినిమా విజయం పట్ల ఆకాంక్షను వ్యక్తం చేసారు.

Leave a comment

error: Content is protected !!