మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి.. ఈ మధ్య కాలంలో సూపర్బ్‌ బజ్‌ క్రియేట్ చేస్తున్న మూవీ. నవీన్ పొలిశెట్టి, అనుష్క కాంబినేషన్‌ అనగానే వర్కవుట్‌ అవుతుందా అనుకున్నవారు..ఇప్పుడు ఈ కాంబినేషన్‌ ఎలా ఉండబోతుందో అని ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 7 న ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచారు. నవీన్‌ పొలిశెట్టి ప్రమోషన్స్‌ లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమాకు హైప్ పెంచుతున్నారు. సెప్టెంబర్ 4 న మీడియాతో Q &A సెషన్‌ నిర్వహించారు.

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి మూవీ కృష్ణష్టమి నాడు రిలీజ్‌ కాబోతుంది.. కృష్ణుడు ఎంత అల్లరి చేస్తాడో అంత అల్లరి ఈ సినిమాలో ఉంటుందన్నారు. జాతిరత్నాలు తర్వాత ఆ ఇమేజ్ కు మ్యాచ్‌ అయ్యే కథ వెతుకుతుంటే ఈ సినిమా కథ వచ్చింది.. బాగా నచ్చిందన్నారు. ఈ స్టోరీ లో ఉన్న పాయింట్‌ యూత్‌ కి బాగా కనెక్ట్‌ అవుతుందన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చేసిన స్టాండప్‌ టూర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. నెక్ట్స్ అమెరికాలోని స్టేట్స్‌లో స్టాండప్‌ టూర్ వేయబోతున్నామన్నారు.

హీరోయిన్‌ అనుష్క ప్రస్తుతం విదేశాల్లో ఉండటం వల్ల ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని, త్వరలో అనుష్క కూడా ప్రమోషన్స్‌లో జాయిన్ అవుతుందన్నారు. అరుంధతి తన ఫేవరెట్ మూవీ అనీ, అనుష్కతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఫీలయ్యానన్నారు. అలాగే తన ఫేవరెట్ హీరో షారుఖ్ సినిమా జవాన్‌ కూడా అదే రోజు వస్తుంది.. ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

మీడియా ఫ్రెండ్స్‌తో అడ్వాన్స్‌ బుకింగ్ అనౌన్స్‌మెంట్ చేయించారు.

Leave a comment

error: Content is protected !!