విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా రాబోతున్న ఫీల్‌ గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఖుషీ. ఈ మూవీ సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్‌ జి. మురళి పాత్రికేయులతో సినిమా విశేషాలు ముచ్చటించారు.పుట్టి పెరిగింది తమిళనాడులో.. అందాల రాక్షసి నుంచి తెలుగు ఇండస్ట్రీలో వర్క్‌ చేస్తున్నారు మురళి. ఖుషీ చిత్రం కోసం మైత్రీ మూవీమేకర్స్‌ రవి గారు డైరెక్టర్‌ శివ గారిచే నేరేషన్‌ ఇప్పించారు,. కథ విపరీతంగా నచ్చింది. ఊహల్లో కన్నా వాస్తవంలో ఎక్కువ బ్రతకడానికి ఇష్టపడతాను.. చేసే పని తీసే సినిమాలు కూడా అలాగే ఉండాలనుకుంటాను.. ఈ ఖుషీ కూడా అలాంటి మూవీనే. మణిరత్నం సినిమాల కోసం పీసీ శ్రీరామ్‌ ఎలాంటి విజువల్స్ ఇచ్చేవారో.. కాపీ కొట్టకుండా అలాంటి ఫ్లేవర్‌ ను తెరపై విజువలైజ్‌ చూపించామంటున్నారు సినిమాటోగ్రాఫర్‌ జి. మురళి.
శివనిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి .. సినిమా పట్ల విపరీతమైన కమాండ్ ఉన్న దర్శకుడు.. ఆయన నేరేట్ చేసిన విధానం సినిమా బాగా తీయడానికి ఉపయోగపడిందన్నారు. సినిమా పట్ల విపరీతమైన ప్యాషన్‌ ఉన్న ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీమేకర్స్‌.. సినిమా కథకు తగ్గట్టు ఎంత వరకు యాక్టింగ్ చేయాలో అంతవరకే సెటిల్డ్ గా పర్‌ఫార్మ్ చేయాలో విజయ్‌, సమంతలు అంతే చేసారన్నారు. ఓవరాల్‌గా మణిరత్నం సినిమా చూస్తున్నంత ఫీల్‌గుడ్‌ ఎక్స్‌పీరియెన్స్ ఖుషీ ఇస్తుందన్నారు సినిమాటోగ్రాఫర్‌ జి. మురళి. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్ UA సర్టిఫికెట్ జారీ చేసారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌1 న సినీ లవర్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి రాబోతుంది.

Leave a comment

error: Content is protected !!