ప్రస్తుతం ఓటిటి & థియేటర్స్ లో ‘థ్రిల్లర్’ మూవీస్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అటు యూత్ నుంచి ఇటు అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ‘మా చాగంటి’ ప్రొడక్షన్ బ్యానర్ లో ‘ఆది సాయికుమార్’, ‘మిషా నారంగ్’, ‘నందిని రాయ్’ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం ‘సిఎస్ఐ సనాతన్’. ఈ సినిమా మార్చ్ 10న థియేటర్ లో గ్రాండ్ గా రీలిజ్ కానుంది.

మా చాగంటి ప్రొడక్షన్ బ్యానర్ లో మొదటి ప్రాజెక్ట్ థ్రిల్లర్ గా వస్తోన్నచిత్రం ‘సిఎస్ఐ సనాతన్’. నిర్మాత కి థ్రిల్లర్ సినిమాలపై ఎక్కువ మక్కువ ఉండటంతో ఈ చిత్రం నిర్మించారు. ఈ కథ ఒక కంపెనీ ‘సిఇవో’ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉండబోతుంది. ఈ మధ్య కాలంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడూ చూడనంత సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. అలాగే, కథలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ వారు ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా చూపించే విధానం సినిమాలో హైలైట్ గా నిలవనుంది. ఈ సినిమా రీమేక్ ఫ్లేవర్ కనిపించిన, పూర్తిగా సొంత కథతో ప్రేక్షకులు ముందుకి రానున్నారు. అసలు ‘సిఎస్ఐ సనాతన్’ అంటే, ‘క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్’ అనేది పూర్తి అర్థం.

మ్యూజిక్ డైరెక్టర్ గా ‘అనీష్ సోలోమాన్’ ఆర్ఆర్ ఖచ్చితంగా థియేటర్స్ లో మోత మోగిపోనుంది. ఇప్పటికి విడుదలైన ‘ట్రైలర్’ బిజీఎమ్ బాగా ఆకట్టుకుంది. ఇక ‘ప్రమోషన్స్’ కు సంబంధించి పెద్ద దర్శకులను అప్రోచ్ అవడానికి ప్రొడక్షన్ గట్టిగానే ప్ల్యాన్ చేస్తుంది. ఇప్పటికే
ట్రైలర్ చూసిన కొంత మంది సెలబ్రిటీస్ థ్రిల్లింగ్ గా ఉందని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకి సీక్వెల్ ని ప్ల్యాన్ చేసినట్టు చిత్ర నిర్మాత వెల్లడించారు. ఇలాంటి కథ ‘ఆది’ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవ్వడంతో నిర్మాతలు హీరో కోసం వెయిట్ చేసారంట. అంతే కాదు, ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర నిర్మాత ధీమా వ్యక్తం చేస్తున్నారు

న‌టీన‌టులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వాసంతి తదితరులు.

Leave a comment

error: Content is protected !!