మెగాస్టార్ కెరియర్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఘరానా మొగుడు. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో కీరవాణి మ్యూజిక్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ధియేటర్లలో ఫ్యాన్స్ చేత డాన్సులు చేయించిందనే చెప్పాలి. ఇంత పెద్ద హిట్ అయిన ఘరానా మొగుడుకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ కూడా వర్క్ చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఎం ఎం కీరవాణి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేసాడు. పండు పండు సాంగ్ కంపోజ్ చేసేటపుడు మణిశర్మ కీబోర్డ్ ప్లే చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఈ పాట కంపోజ్ చేసే టైమ్లో కీరవాణి దగ్గరికి మణిశర్మ వెళ్లలేకపోయాడు. తను వెళ్లకపోయినా తన క్లోజ్ ఫ్రెండ్ ఏఆర్ రెహమాన్ ని పంపించాడు. ఆ విధంగా ఘరానా మొగుడులోని పండు పండు సాంగ్ కి ఎఆర్ రెహమాన్ కీబోర్డ్ ప్లే చేసాడు.