G2 Movie : 2018లో విడుదలైన ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అడివి శేష్.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘జీ2’తో సిద్ధమవుతున్నారు. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘గూఢచారి’ విడుదలై ఆరు సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో, ‘జీ2’ నుంచి ఆరు అద్భుతమైన యాక్షన్‌ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ, ‘గూఢచారి’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని, ‘జీ2’ దాన్ని మించి అంతర్జాతీయ స్థాయి సినిమాగా ఉంటుందని అన్నారు. దర్శకుడు వినయ్‌ కుమార్‌ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు.

ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయిందని, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్‌ అనుభూతిని అందిస్తాయని చెప్పారు. నిర్మాతలు ఈ సినిమాను 2025 ద్వితీయార్ధంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘జీ2’ కు అడివి శేష్ మరియు వినయ్‌ కుమార్‌ కలిసి కథ అందించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తుండగా, అజీమ్‌ మహ్మద్‌ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!