Kollywood : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులను అలరి స్తున్నారు. దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘వేట్టయాన్’ సినిమా తర్వాత ‘కూలీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇక, ‘జైలర్ 2’ కోసం నెల్సన్ దిలీప్ కుమార్‌తో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంతటితో ఆగకుండా, రజినీకాంత్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మలయాళ దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ తన తాజా సినిమా కోసం రజినీకాంత్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ గతేడాది ‘2018’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నారు. తొలుత ఈ సినిమా కోసం శింబును సంప్రదించినప్పటికీ, కథా స్థాయిని దృష్టిలో పెట్టుకుని రజినీకాంత్‌ను తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇప్పటికే చేస్తున్న వరుస సినిమాలతో పాటు ఈ కొత్త ప్రాజెక్ట్‌ కూడా అతని ఫ్యాన్స్‌కు పండగే. రజినీకాంత్ మరియు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Leave a comment

error: Content is protected !!