ఓటీటీ మార్కెట్ పడిపోయినా కొన్ని సినిమాలు మాత్రం మంచి డీల్స్ దక్కించుకుంటున్నాయి. అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబో మూవీ ‘తండేల్’ రూ.40 కోట్లకు అమ్ముడైతే, ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రూ.14 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడైంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ చైత‌న్య ద‌ర్శకుడు.

మే 17న విడుద‌ల కానున్న ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లై మంచి స్పందన పొందింది. విశ్వక్ మాస్ అవ‌తార్, పాట‌లు కూడా క్లిక్ అవ్వడంతో ఓటీటీ మార్కెట్ క్లియ‌రెన్స్ సులభమైంది. ఇప్పుడు శాటిలైట్ డీల్ చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ కూడా వారం రోజుల్లో ఓ కొలిక్కి రావచ్చని అంచనా. శాటిలైట్ డీల్ కూడా ఖరారు అయితే, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుద‌ల‌కు ముందే సేఫ్ జోన్‌లోకి చేరుతుంది.

Leave a comment

error: Content is protected !!