ప్రస్తుతం  కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని ఒణికిస్తోన్న నేపథ్యంలో..  దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరో పక్క చాలా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇల్లు దాటి బైటికి అడుగుపెడితేనే గానీ.. రోజులు గడవని నిరుపేద కళాకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి పదిరోజులకు సరిపడా నిత్యావరసర వస్తువుల్ని సరఫరా చేస్తానని ప్రకటించారు హీరో రాజశేఖర్ .

రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన బాధ్యతగా సరుకులు అందించాలని రాజశేఖర్ నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు 9010810140 నెంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలు అందించి.. సహాయం పొందాలని సూచించారు. రాజశేఖర్ చేస్తున్న ఈ సత్కార్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!