కరోనా వైరస్  ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.  ఇందుకోసం చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. మ‌న‌కోసం  అనే సంస్థ ఏర్పాటైంది. ఇప్పటికే ఈ సంస్థకు చాలామంది టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ విరాళాలు అందజేశారు.

తాజాగా సినీకార్మికుల్ని ఆదుకునేందుకు సి సి సి కి. ప్రముఖ సీనియర్ నటులు గిరిబాబు తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు ఈ లక్ష రూపాయలను గురువారం నెఫ్ట్ ద్వారా సి. సి. సి కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది.

Leave a comment

error: Content is protected !!