ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి ఆ నిధులతో సినీ కార్మికులకు నిత్యావసరాల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల ఇళ్ళకు నిత్యావసరాల్ని పంపిణీ చేసే ప్రక్రియ మొదలైంది. చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా .. లారీలోంచి దింపుతోన్న  బియ్యపు బస్తాల్ని,   కార్మికుల కోసం సిద్ధం చేస్తోన్న ప్రోవిజనల్స్ విశేషాలతో కూడిన ఒక వీడియో ను విడుదల చేశారు.

Leave a comment

error: Content is protected !!