Shopping Cart 0 items - $0.00 0

సల్మాన్ ఖాన్ తో మైత్రీ మూవీస్

 

 

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించి.. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది మైత్రీ మూవీస్ సంస్థ. ఆ తర్వాత ‘సవ్యసాచి, చిత్రలహరి, అమర్ అక్బర్ ఆంటోనీ, డియర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడర్  చిత్రాలను  నిర్మించారు.  ఇప్పుడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ హీరోగా ‘ఉప్పెన’ ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు.  త్వరలో అల్లు అర్జున్ తోనూ, పవన్ కళ్యాణ తోనూ, ప్రభాస్ తోనూ సినిమాలు నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఈ మెగా ప్రొడక్షన్ సంస్థ మరో మెట్టు పైకెక్కనుంది. త్వరలో బాలీవుడ్ లో కూడా ఒక భారీ బట్జెట్ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అది కూడా అలా ఇలా కాదు.. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో సినిమా నిర్మించనుంది.

బాలీవుడ్ లో కూడా   తమ  మార్కెట్  ను విస్తరించుకోవడానికి మైత్రీ మూవీస్ వారు అక్కడ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుండడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని సల్మాన్ ఖాన్ బావ, నిర్మాత అయిన అతుల్ అగ్నిహోత్రిని ఈ ప్రాజెక్ట్ విషయమై సంప్రదించారట. అతుల్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో రాధే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా హడావిడి పూర్తయ్యాకా సల్మాన్ ను మైత్రీవారు కలవనున్నారట. మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరవుతారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!