టాలీవుడ్ హీరో  శ్రీకాంత్ తండ్రి మేకా పరమేశ్వరరావు నిన్న రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత 4 నెలలుగా స్టార్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా మేకా వారి పాలానికి చెందిన పరమేశ్వరరావు కు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మహాప్రాస్థానంలో ఆయన అంత్య క్రియలు జరగనున్నాయి.

పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. శ్రీకాంత్ కు ,చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. శ్రీకాంత్ తండ్రి మరణ వార్త విన్నవెంటనే చిరంజీవి ఆయన ఇంటికి వెళ్ళి .. శ్రీకాంత్ ను  , కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పరమేశ్వరరావు మృతదేహానికి శ్రాద్ధాంజలి ఘటించారు.

Leave a comment

error: Content is protected !!