అక్కినేని నాగార్జున నటవారసుడు అఖిల్ కు .. ఇప్పటికిప్పుడు ఓ  మైండ్ బ్లోయింగ్ హిట్టు కావాలి. తొలి మూడు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచిన నేపథ్యంలో నాలుగు చిత్రం కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ తో  అతడికి మంచి హిట్టిచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ మూవీ మీద కూడా అంతగా హోప్స్ లేవు. అఖిల్ కు ప్రేమకథాచిత్రాలు అంతగా కలిసిరావడం లేదనేది కూడా ఒక కారణం. మొదటి సినిమా ‘అఖిల్’ యాక్షన్ మూవీ అయినప్పటికీ ఫాంటసీ జోనర్ అవడంతో ఆ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఐదో ప్రాజెక్ట్ కోసం అఖిల్ రూట్ మార్చబోతున్నాడని సమాచారం.

ఇకపై అఖిల్ యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్ టైనర్స్ మీద దృష్టి సారించనున్నాడట. అందులో భాగంగా తమిళ యాక్షన్ డైరెక్టర్ పి.యస్ . మిత్రన్ తో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడట. ప్రస్తుతం  ఈ సినిమా కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి . విశాల్ తో ‘ఇరుంబుతిరై’ (తెలుగులో  ‘అభిమన్యుడు’), శివకార్తికేయన్ తో ‘హీరో’ చిత్రాలు తెరకెక్కించి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న మిత్రన్ అఖిల్ కోసం ఓ మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ సిద్ధం చేస్తున్నడట. అలాగే … అఖిల్ హీరోగా  బాలీవుడ్ సూపర్ హిట్టు కామెడీ చిత్రం ‘బదాయిహో’ ను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రయత్నిస్తున్నాడని  టాక్. నీనాగుప్తా, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి .. తెలుగులో దర్శకుడిగా అనిల్ రావిపూడిని సెట్ చేయనున్నారట. నాగార్జున అఖిల్ కోసం అనిల్ రావిపూడి కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది ఈ సినిమా కోసమేనని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలతోనైనా అఖిల్ .. సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!