కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. తాజాగా ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కూడా చేరారు.

శ్రీకాంత్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురికి తన వంతు సాయం అందించారు. రాయదుర్గం పోలీసుల ఆధ్వర్యంలో రోజూ వారి కార్మికులకు శానిటైజర్స్, ఆహార సామాగ్రిని శ్రీకాంత్ పంపిణీ చేశారు. లాక్‌డౌన్ పాటించి అందరూ ఇంట్లోనే ఉండాలని, ఎవరికి వారు ఇది తమ బాధ్యత అనుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

 

Leave a comment

error: Content is protected !!