తెలుగమ్మాయి అయినప్పటికీ.. తన టాలెంట్ తో సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలో పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటించి సత్తా చాటుకుంది శోభితా ధూళిపాళ. ‘రమణ్ రాఘవ్ 2.0’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శోభితా.. ‘గూఢచారి’ చిత్రంతో తెలుగు తెరపై కథానాయికగా అరంగేట్రం చేసింది. అలాగే.. ‘మూత్తోన్’ మూవీతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టనుంది. పైగా మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ చిత్రంలో ఒక మెమరబుల్ రోల్ చేయబోతోంది. మణిసార్   డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ ప్రస్తతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్ , త్రిషా ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాలో శోభితా యువరాణిగా నటించనుందట.

10,11 శాతాబ్దాల్లో చోళ వంశాన్నిపాలించిన అరుళ్ మొళివర్మన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  కల్కి కృష్ణ మూర్తి రచించిన ‘పొన్నియన సెల్వన్’ కల్పిత చారిత్రక నవల ఈ సినిమాకి ఆధారం . ఇందులో శోభితా కూచిపూడి , భరతనాట్యం తెలిసిన యువరాణిగా నటించబోతోంది. రెండు భాగాలుగా రానున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం మొదటి భాగం  2021 లో విడుదల కాబోతోంది.  మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న పొన్నియన్ సెల్వన్ చిత్రం శోభితా ధూళిపాళకు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!