యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి మహా మల్టి స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 8న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు.   ఇక ఈ సినిమా తర్వాత తారక్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్వకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్ , యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను కథానాయికగా అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం యన్టీఆర్ సరసన సమంతా కథానాయికగా ఎంపికయిందనే వార్తలొస్తున్నాయి.

ఇంతకు ముందు సమంతా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి , అఆ’ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే.. యన్టీఆర్ సరసన ‘రామయ్యా వస్తావయ్యా, బృందావనం, రభస , జనతా గ్యారేజ్’ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ జంటను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండడం ఆసక్తి రేపుతోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న తారక్ 30 చిత్రం సమంతాకు ఏ రేంజ్ లో క్రేజ్ తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!