డైనమైట్ తర్వాత దర్శకుడు దేవా కట్టా తెలుగులో మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. రీసెంట్ గా ‘ప్రస్థానం’ హిందీ వెర్షన్ ను తెరకెక్కించగా.. అది పరాజయం పాలైంది. అంతకు ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ను, అలాగే బాహుబలి బిఫోర్ బిగినింగ్ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ కోసం  డైరెక్ట్ చేశాడు. త్వరలో సాయిధరమ్ తేజ తో ఒక సినిమా తెరకెక్కించనున్న దేవా .. అదే చేత్తో ఒక వెబ్ సిరీస్ నూ చేయబోతున్నాడు. అది కూడా మహేశ్ బాబు జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై చేయబోతున్నాడని సమాచారం. 

మహేశ్ బాబు  జీయమ్బీ  ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు’ లాంటి చిత్రాలకు ఈ బ్యానరే  నిర్మాణ భాగస్వామ్యం వహించింది.  ఇదే బ్యానర్ పై ప్రస్తుతం అడివి శేష్ తో మేజర్ అనే బయోపిక్ నిర్మాణం జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేశ్ బాబు డిజిటల్  ప్లాట్ ఫామ్ లోకి కూాడా ఎంటర్ కానున్నాడు.   ఆ బ్యానర్ లోనే ఇప్పుడు దేవాకట్టా వెబ్ సిరీస్ నిర్మాణం జరుపుకోనుంది.   పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ కేటగిరిలో  చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది. మరి దేవా కట్టా ఈ వెబ్ సిరీస్ తో మళ్లీ ఫామ్ లోకొస్తాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!