మెగా ప్రిన్స్ వరుణ్ తేజ డెబ్యూ మూవీ ‘ముకుంద’ పర్వాలేదనిపించుకుంది. అందాల పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వరుణ్, పూజా, శ్రీకాంత్ అడ్డాల కాంబో రిపీట్ కానుందట. మొన్నామధ్య వరుణ్ తేజకు శ్రీకాంత్ అడ్డాల ఒక అందమైన ప్రేమకథ నెరేట్ చేశాడట. ఆ కథకు బాగా ఇంప్రెస్ అయిన వరుణ్ తేజ పూర్తి స్ర్కిప్ట్ రెడీ అయితే.. తప్పకుండా చేద్దామని మాటిచ్చాడట. అంతేకాదు ఇందులో కథానాయికగా నటించడానికి పూజా హెగ్డే కూడా తన అంగీకారం తెలిపిందట.

ప్రస్తుతం వరుణ్ తేజ కిరణ్ కొర్రపాటి ‘బాక్సర్’ మూవీ హడావిడిలో ఉన్నాడు.  దీని తర్వాత అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీలో నటిస్తాడు.  ఆ తర్వాత అన్నీ కుదిరితే.. శ్రీకాంత్ అడ్డాల సినిమా సెట్స్ మీదకు వెళ్ళుతుందనే టాక్ వినిపిస్తోంది.  ఇక ఇప్పుడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా వెంకీ తో ‘నారప్ప’మూవీ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యేటప్పటికి మరింత టైమ్ పడుతుంది. కాబట్టి..  వరుణ్ తేజ, శ్రీకాంత్ సినిమా మొదలవడానికి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. మరి ఈ సారి ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!