96’ తమిళ మూవీ తెలుగు వెర్షన్ ‘జాను’ తో యంగ్ హీరో శర్వానంద్, అందాల సమంతా కాంబినేషన్ తొలిసారిగా సెట్టయింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ .. ఒరిజినల్ వెర్షన్ లోని విజయ్ సేతుపతి, త్రిషాల రేంజ్ లో బాగా కుదరిందని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ ఇద్దరి జోడీని మరోసారి రిపీట్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. ‘ఆర్. ఎక్స్ 100’ తో సంచలన విజయం నమోదు చేసిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడని వినికిడి.

‘ఆర్.ఎక్స్ 100’ సినిమా క్రెడిట్ తో హీరో కార్తికేయ ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసేశాడు.  అయితే దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇంకా రెండో సినిమానే ఇంకా సెట్స్ మీదకు తీసుకురాలేకపోయాడు.  నిజానికి ‘మహాసముద్రం’ అనే టైటిల్ తో ఒక కథ రెడీ చేసుకొని రవితేజకి, నాగచైతన్యకి వినిపించాడు. అయితే ఫైనల్ గా బాల్ అక్కినేని కోర్ట్ లో నిలిచింది.  కథానాయికగా సమంతా ను కూడా ఫిక్స్ చేశాడు. కానీ .. చైతు ఆ సినిమాను చేస్తాడా చేయడా అనే క్లారిటీ ఇంతవరకూ దర్శకుడికి రాలేదట. దాంతో ఇప్పుడు అజయ్ భూపతి..  సమంతానే హీరోయిన్ గా ఖాయం చేసుకొని..  హీరోగా శర్వానంద్ ను ఎంపిక చేశాడట. ఆ మేరకు సమంతా, శర్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. త్వరలోనే ఈ ఇద్దరి జోడీతో సినిమా అనౌన్స్ మెంట్ జరగనుందని తెలుస్తోంది.

 

Leave a comment

error: Content is protected !!