Shopping Cart 0 items - $0.00 0

భళ్ళాలదేవ vs దేవసేన

‘బాహుబలి సిరీస్ , రుద్రమదేవి’ చిత్రాలతో స్ర్కీన్ షేర్ చేసుకొని,  తమ అసాధారణ నటనతో  సౌత్ ఆడియన్స్ ను మెప్పించారు దగ్గుబాటి రానా, అందాల అనుష్క. ఇప్పుడీ ఇద్దరూ రెండు వేరు వేరు చిత్రాలతో ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద తలపడనుండడం ఆసక్తి గా మారింది. రానా హీరోగా తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కిస్తోన్న ‘హాథీ మేరే సాథీ’ బాలీవుడ్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ ఏప్రిల్ 2న విడుదల కానుంది. తెలుగు వెర్షన్ ‘అరణ్య’ గానూ, తమిళ వెర్షన్ ‘కాడన్’ గానూ రూపుదిద్దుకుంటోంది. బాందేవ్ అనే మావటి పాత్రలో రానా స్టన్నింగ్ మేకోవర్ తో రానున్నాడు.

ఇక అనుష్క సాక్షి అనే  మూగ, బధిర చిత్రకారిణి గా నటిస్తోన్న ‘నిశ్శబ్దం’ చిత్రం కూడా ఏఫ్రిల్ 2నే విడుదల తేదీని లాక్ చేసుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నిజానికి ఈ  ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ ను వాయిదా వేసుకుంది. కీలక పాత్రలో మాధవన్ , మరో ప్రత్యేకమైన పాత్రలో హాలీవుడ్ నటుడు మైకేల్ మేడ్సన్ నటిస్తోన్న ‘నిశ్శబ్దం’ రానా ‘అరణ్య’ చిత్రాన్ని ఢీకొట్టనుండడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.  మరి ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!